ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టనున్న బీజేపీ

ABN , First Publish Date - 2021-05-18T03:13:32+05:30 IST

తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 19న ‘‘గరీబోళ్ల కోసం భారతీయ

ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేపట్టనున్న బీజేపీ

హైదరాబాద్: తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 19న ‘‘గరీబోళ్ల కోసం భారతీయ జనతా పార్టీ దీక్ష’’ చేపడుతున్నామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్న డిమాండ్ కూడా ఇందులో ఉంటుందని తెలిపారు. చికిత్సను ఆరోగ్యశ్రీ కిందికి తేవడంతో పాటు చికిత్స ఖర్చును 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాలతో మండల స్థాయి నుంచి రాష్ట్ర పదాధికారుల వరకూ అందరూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ఇంట్లోనే దీక్షలు చేయాలని ప్రేమేందర్ రెడ్డి సూచించారు. 

Updated Date - 2021-05-18T03:13:32+05:30 IST