రాష్ట్రంలో టీఆర్ఎస్ పతనం ప్రారంభం: రమణ్సింగ్
ABN , First Publish Date - 2022-01-07T00:36:01+05:30 IST
తెలంగాణలో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్సింగ్ అన్నారు. గురువారం ఆయన
కరీంనగర్: తెలంగాణలో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్సింగ్ అన్నారు. గురువారం ఆయన కరీంనగర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కుమార్ను కలిసి ఎంపీ కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసులు ఎంపీ కార్యాలయంపై దాడిచేసి తాళాలు పగులగొట్టి లోపల ఉన్న బండి సంజయ్ సహా కార్యకర్తలపై విక్షచణ రహితంగా లాఠీచార్జీ చేయడమే కాకుండా దొంగల్లా సీసీపుటేజీలను ఎత్తుకెళ్లారన్నారు. కార్యకర్తలు, మహిళలు అని చూడకుండా లాఠీచార్జ్ చేసి అసభ్యంగా ప్రవర్తించారని మండిపడ్డారు. భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద రాజకీయ దుర్ఘటన చూడలేదని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండేందుకు అర్హత లేదని రమణ్సింగ్ అన్నారు.