మహిళా సాధికారతపై బీజేపీ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి: Kavitha
ABN , First Publish Date - 2022-06-10T19:22:53+05:30 IST
మహిళా సాధికారత పట్ల బీజేపీ నేతల ప్రచారంపై ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్: మహిళా సాధికారత పట్ల బీజేపీ నేతల ప్రచారంపై ఎమ్మెల్సీ కవిత (Kavitha) కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... మహిళా సాధికారతపై బీజేపీ తప్పుడు ప్రచారాలు మానుకోవాలన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం వాస్తవాలను దాచేస్తున్నారని మండిపడ్డారు. ధరల నియంత్రణలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. అంగన్వాడీలకు 50 శాతం బడ్జెట్ను తగ్గించింది బీజేపీ ప్రభుత్వమని కవిత వ్యాఖ్యానించారు.