విద్యాసాగర్ వ్యాఖ్యలపై బీజేపీ నిరసన.. కోరుట్ల, మెట్పల్లిలో తీవ్ర ఉద్రిక్తత
ABN , First Publish Date - 2021-01-21T23:01:07+05:30 IST
కోరుట్ల, మెట్పల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ వ్యాఖ్యలపై బీజేపీ నిరసన వ్యక్తం చేసింది
జగిత్యాల: కోరుట్ల, మెట్పల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ వ్యాఖ్యలపై బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. బీజేపీ కార్యకర్తలను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునేందుకు వచ్చారు. ఇరు పార్టీ నేతలు పోటాపోటీగా నినాదాలు చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.