టీఆర్ఎస్ నేత ఆగయ్యను పరామర్శించిన మంత్రి గంగుల
ABN , First Publish Date - 2022-03-19T17:15:07+05:30 IST
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్యను మంత్రి గంగుల కమలాకర్ శనివారం ఉదయం పరామర్శించారు.
రాజన్న సిరిసిల్ల: టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్యను మంత్రి గంగుల కమలాకర్ శనివారం ఉదయం పరామర్శించారు. ఎల్లారెడ్డిపేటలో నిన్న టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల ఘర్షణ చోటు చేసుకుంది. ఆగయ్య ఇంటిపై బీజేపీ దాడి చేసిందని ఆరోపణలు వచ్చాయి. ఈ సందర్భంగా ఆగయ్యను పరామర్శించిన మంత్రి గంగుల మీడియాతో మాట్లాడుతూ... గోపి అనే వ్యక్తి తుపాకీ పట్టుకొని వచ్చారని... కొంతమంది బీజేపీ కార్యకర్తలు కట్టెలు పట్టుకొని దాడికి వచ్చారని తెలిపారు. యూపీ, గుజరాత్, బీహార్ సంసృతిని బీజేపీ నమ్ముకుందన్నారు. తమపై దాడులు చేస్తే ఊరుకోమని మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు.