యాదాద్రికి భారీగా విరాళం అందజేసిన మేడ్చల్ టీఆర్ఎస్ నేతలు

ABN , First Publish Date - 2021-10-28T22:06:14+05:30 IST

లక్ష్మినరసింహస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం కోసం విరాళాలు భారీగా చేరుతున్నాయి.

యాదాద్రికి భారీగా విరాళం అందజేసిన మేడ్చల్ టీఆర్ఎస్ నేతలు

యాదాద్రి భవనగిరి: లక్ష్మినరసింహస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం కోసం విరాళాలు భారీగా చేరుతున్నాయి. సీఎం కేసీఆర్ పిలుపుతో దాతలు బంగారాన్ని కానుకగా సమర్పిస్తున్నారు. మేడ్చల్ నియోజకవర్గం కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు యాదాద్రి ఆలయానికి మూడు కిలోల బంగారం ఇవ్వాలని నిర్ణయించారు. మంత్రి మల్లారెడ్డితో కలిసి యాదాద్రి వెళ్లిన మేడ్చల్ టీఆర్ఎస్ నేతలు మూడు కిలోల బంగారానికి అయ్యే నగదును ఆలయ అధికారులకు అందజేశారు. అంతకు ముందు ఆలయ అధికారులు మంత్రి మల్లారెడ్డి, ప్రజాప్రతినిధులకు స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో యాదాద్రి అభివృద్ధికి తనవంతుగా మూడు కిలోల బంగారాన్ని ఇచ్చినట్లు  మంత్రి మల్లారెడ్డి తెలిపారు.

Updated Date - 2021-10-28T22:06:14+05:30 IST