టీఆర్ఎస్ నేతలు మొహం చాటేశారు: వంశీచంద్
ABN , First Publish Date - 2020-08-13T07:36:30+05:30 IST
పోతిరెడ్డిపాడు విషయంలో బహిరంగ చర్చకు రావాలంటూ తాను విసిరిన సవాల్పై టీఆర్ఎస్ నేతలు
హైదరాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): పోతిరెడ్డిపాడు విషయంలో బహిరంగ చర్చకు రావాలంటూ తాను విసిరిన సవాల్పై టీఆర్ఎస్ నేతలు మొహం చాటేశారని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్రెడ్డి అన్నారు. తెలంగాణ ద్రోహులు కాబట్టే వారు చర్చకు రాలేదని విమర్శించారు. పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోత ల పథకాలపై చర్చించేందుకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తాను సిద్ధంగా ఉంటానని, చిత్తశుద్ధి నిరూపించుకునేందుకు ప్రతినిధులను పంపాలని సీఎం కేసీఆర్కు మంగళవారం వంశీచంద్ లేఖ రాశారు. అయితే, బహిరంగ చర్చకు ఎవరూ రాకపోవడంతో ఆ తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు.