వైరల్‌ ఆడియోపై విచారణ

ABN , First Publish Date - 2021-08-13T02:50:51+05:30 IST

సోషల్ మీడియాలో సీఐ పేరుతో వైరల్‌ అయిన ఆడియోపై విచారణకు ఆదేశించినట్లు ఎస్పీ విశాల్

వైరల్‌ ఆడియోపై విచారణ

గుంటూరు: సోషల్ మీడియాలో సీఐ పేరుతో వైరల్‌ అయిన ఆడియోపై విచారణకు ఆదేశించినట్లు ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. రాజధానిలో గ్రావెల్ తవ్వకాలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణను పరిశీలించామన్నారు. సంభాషణపై అదనపు ఎస్పీ స్థాయి అధికారిచే దర్యాప్తు చేస్తామని ఎస్పీ విశాల్ పేర్కొన్నారు. నిజానిజాల బట్టి బాధ్యులపై తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. 

Updated Date - 2021-08-13T02:50:51+05:30 IST