హత్య కేసుపై విచారణ
ABN , First Publish Date - 2020-07-10T10:20:23+05:30 IST
మండలంలోని మల్లారంలో హత్యకు గురైన రేవెల్లి రాజబాబు కేసుకు సంబంధించి గురువారం కాటారం డీఎస్సీ బోనాల కిషన్ విచారణ చేపట్టారు.
మల్హర్, జూలై 9 : మండలంలోని మల్లారంలో హత్యకు గురైన రేవెల్లి రాజబాబు కేసుకు సంబంధించి గురువారం కాటారం డీఎస్సీ బోనాల కిషన్ విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన దేవసాని శ్రీనివాస్, కుసుమ శేఖర్, కుసుమ సంపత్పై హత్య, ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు కాగా బాధితులను, సాక్షులను కలిసి పలు విషయాలను రాబట్టారు. ఆయన వెంట కాటారం సీఐ హతీరాం, ఎస్సై సత్యనారాయణలు ఉన్నారు.