మరియమ్మ లాకప్ డెత్‌పై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2021-11-10T23:32:01+05:30 IST

మరియమ్మ లాకప్ డెత్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. మరియమ్మ లాకప్ డెత్‌పై హైకోర్టులో పీయూసీఎల్ పిల్‌ దాఖలు చేసింది.

మరియమ్మ లాకప్ డెత్‌పై హైకోర్టులో విచారణ

హైదరాబాద్‌: మరియమ్మ లాకప్ డెత్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. మరియమ్మ లాకప్ డెత్‌పై హైకోర్టులో పీయూసీఎల్ పిల్‌ దాఖలు చేసింది. ఈ పిల్‌పై బుధవారం చీఫ్‌ జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి ధర్మాసనం విచారణ జరిపింది. మరియమ్మ మృతిపై హైకోర్టుకు మెజిస్ట్రేట్ విచారణ నివేదిక సమర్పించారు. మరియమ్మ లాకప్ డెత్ కేసు సీబీఐకి అప్పగించదగిన కేసని హైకోర్టు అభిప్రాయపడింది. ఈనెల 22న విచారణకు రావాలని సీబీఐ ఎస్పీకి హైకోర్టు నోటీసులిచ్చింది. కేసు పూర్తి వివరాలను అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌కు అప్పగించాలని ఏజీకి న్యాయస్థానం ఆదేశించింది. ఎస్ఐ, కానిస్టేబుల్‌ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. బాధ్యులపై క్రిమినల్ చర్యలు ఏం తీసుకున్నారని హైకోర్టు  ప్రశ్నించింది. మరియమ్మ కుటుంబానికి పరిహారం చెల్లించినట్లు ఏజీ ప్రసాద్ తెలిపారు. పరిహారం ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇతర ఆరోగ్య సమస్యలతో మరియమ్మ గుండె ఆగి చనిపోయిందని ఏజీ కోర్టుకు తెలిపారు. రెండో పోస్టుమార్టం నివేదికలో మరియమ్మపై గాయాలున్నాయని హైకోర్టు తెలిపింది. గుండె ఆగిపోయేలా ఎవరైనా కొడతారా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. సీబీఐ వంటి స్వతంత్ర సంస్థల దర్యాప్తు అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. సీబీఐ, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుపై విచారణను ఈనెల 22కి వాయిదా వేశారు.

Updated Date - 2021-11-10T23:32:01+05:30 IST