ట్రైలర్ వదులుతున్నారు
ABN , First Publish Date - 2022-01-30T05:30:00+05:30 IST
తెలుగులో హిట్ అయిన ‘గద్దలకొండ గణేశ్’ చిత్రం బాలీవుడ్లో ‘బచ్చన్ పాండే’ పేరుతో రీమేక్ అవుతున్న సంగతి విదితమే. అక్షయ్కుమార్, కీర్తి సనన్, జాక్వలిన్ ఫెర్నాండెజ్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం విడుదల తేదీని ఇప్పటికి రెండు సార్లు మార్చారు....
తెలుగులో హిట్ అయిన ‘గద్దలకొండ గణేశ్’ చిత్రం బాలీవుడ్లో ‘బచ్చన్ పాండే’ పేరుతో రీమేక్ అవుతున్న సంగతి విదితమే. అక్షయ్కుమార్, కీర్తి సనన్, జాక్వలిన్ ఫెర్నాండెజ్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం విడుదల తేదీని ఇప్పటికి రెండు సార్లు మార్చారు. మొదట 2020 డిసెంబర్ 25న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా డేట్ మారింది. 2021 జనవరి 22న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకువస్తామని ప్రకటించారు. మరోసారి కరోనా అడ్డు పడడంతో ఈ డేట్ కూడా మారింది. తాజాగా ఇప్పుడు మార్చి 18న విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. అదుగో వస్తోంది.. ఇదిగో వస్తోంది.. అంటూ ఇంతకాలం ప్రేక్షకుల్ని ఊరిస్తుండడంతో ట్రైలర్ను ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. విడుదలకు 40 రోజులకు ముందే ట్రైలర్ను వదలడం కరెక్ట్ కాదేమో అనే కొందరు అంటున్నా మేకర్స్ పట్టించుకోకుండా ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. యాక్షన్ , కామెడీ, రొమాన్స్, డ్రామా అంశాలతో రూపుదిద్దుకున్న ‘బచ్చన్ పాండే’ చిత్రం ఆడియన్స్కు ఫుల్ మీల్స్ లాంటిదని దర్శకనిర్మాతలు కాన్ఫిడెన్స్తో చెబుతున్నారు.