నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

ABN , First Publish Date - 2022-04-27T13:36:28+05:30 IST

టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈరోజు ఉదయం 8:30 గంటల నుండి 11 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు హైటెక్స్ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగనున్నాయి.  కొత్తగూడ, హైటెక్స్, సైబర్ టవర్స్  ప్రాంతాల్లో ఆఫీసులు ఉన్న వారు తమ సమయాలు మార్పు చేసుకోవాలని పోలీసులు సూచించారు. నీరుస్ నుంచి గచ్చిబౌలి చౌరస్తాకు వచ్చే వాహనాలు అయ్యప్ప సొసైటీ, దుర్గం చెరువు వైపు మళ్లించారు. మియాపూర్, కొత్తగూడ , హఫీజ్‌పేట్ ప్రాంతాల నుంచి హైటెక్ సిటీ, సైబర్ టవర్, జూబ్లీహిల్స్ వైపు వచ్చే వాహనాలను ఏఐజి ఆస్పత్రి, ఐకియా, ఇనార్బిట్ మాల్, దుర్గం చెరువు మీదుగా దారి మళ్లించారు. 

Updated Date - 2022-04-27T13:36:28+05:30 IST