ఒకే ఫ్రేమ్‌లో ‘టీపీసీసీ నేతలు’

ABN , First Publish Date - 2020-12-24T20:03:53+05:30 IST

రాహుల్ గాంధీ నేతృత్వంలో చేపట్టిన ‘మార్చ్’ సందర్భంగా ఆసక్తికర ఫొటో ఒకటి క్లిక్ మంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఒకే ఫ్రేమ్‌లో ‘టీపీసీసీ నేతలు’

న్యూఢిల్లీ : రాహుల్ గాంధీ నేతృత్వంలో చేపట్టిన ‘మార్చ్’ సందర్భంగా ఆసక్తికర ఫొటో ఒకటి క్లిక్ మంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి ముగ్గురూ ఒకే చోట చేరి... ఫొటోలకు పని చెప్పారు. ఒకరేమో.... పీసీసీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే.. మరో ఇద్దరు... పీసీసీ కోసం తీవ్రంగా పోటీపడుతున్నవారు. ఒకరు భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కాగా, మరొకరు మేడ్చల్ ఎంపీ రేవంత్ రెడ్డి. కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి మధ్యే పీసీసీ కుర్చీ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. టీపీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలని కాంగ్రెస్ అధిష్ఠానం తలలు పట్టుకున్న వేళ.. ఈ ముగ్గురూ ఒక చోట చేరిన ఫొటో ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Updated Date - 2020-12-24T20:03:53+05:30 IST