వీహెచ్ ఇంటిపై దాడిని ఖండించిన రేవంత్
ABN , First Publish Date - 2022-04-14T15:16:48+05:30 IST
మాజీ ఎంపీ వి.హనుమంతరావు రావు ఇంటిపైన దుండగుల దాడిని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
హైదరాబాద్: మాజీ ఎంపీ వి.హనుమంతరావు రావు ఇంటిపైన దుండగుల దాడిని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దాడి పట్ల రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణలో రోజు రోజుకూ శాంతి భద్రత లు క్షీణిస్తున్నాయన్నారు. దోషులను పోలీసులు వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వి.హనుమంతరావు ప్రజల మనిషి అని, ఎవరికి ఆపద వచ్చినా ముందుంటారని అలాంటి వ్యక్తిపై దాడి ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులకు పోలీసులు మరింత భద్రత కల్పించాలన్నారు. కాంగ్రెస్ నాయకులపై దాడులు జరిగితే ఊరుకునేది లేదని.. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
కాగా...హనుమంతరావు ఇంటిపై దుండగులు అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇంటి అద్దాలు, కారు ధ్వంసమైంది.