తిరుపతిలో టూరిజం అభివృద్ధికి కృషి: రోజా
ABN , First Publish Date - 2022-04-22T00:12:41+05:30 IST
తిరుపతిలో టూరిజం అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి రోజా ప్రకటించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తిరుపతి
తిరుపతి: తిరుపతిలో టూరిజం అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి రోజా ప్రకటించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తిరుపతి జూపార్క్లో ఎలక్ట్రిక్ వాహనాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. చంద్రగిరి కోటను అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. ఏపీ టూరిజానికి టీటీడీ దర్శన టికెట్ల కోటా పెంపునకు కృషి చేస్తానని చెప్పారు. తిరుపతిలో టీటీడీ గదుల బుకింగ్ కౌంటర్ ఏర్పాటు అవసరమని అభిప్రాయపడ్డారు. ఏపీలోని పర్యాటక ప్రాంతాల సమగ్ర సమాచారం ఉండేలా యాప్ రూపొందిస్తామని రోజా తెలిపారు.