BJP జెండా గద్దెను కూల్చేసిన దుండగులు.. నేడు ఛలో సింగపైర్
ABN , First Publish Date - 2021-08-06T14:22:20+05:30 IST
హుజురాబాద్ ఉప ఎన్నిక ముందు నియోజకవర్గంలో ఊహించని ఘటనలు జరుగుతున్నాయి.
కరీంనగర్ : హుజురాబాద్ ఉప ఎన్నిక ముందు నియోజకవర్గంలో ఊహించని ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికే అధికార, ప్రతిపక్షపార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా తాజాగా మరో ఘటన చోటుచేసుంది. ఈ ఘటనతో తెలంగాణ బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. హుజురాబాద్ మండలం సింగపూర్లో బీజేపీ జెండా గద్దెను కొందరు దుండగులు కూల్చేశారు. దీంతో స్థానిక బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. సింగపూర్లో బీజేపీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ ఘటనను నిరసిస్తూ ‘నేడు ఛలో సింగపైర్’కు బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు రంగంలోకి దిగారు.