చిన్నశేషవాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు.. దర్శించుకున్న జగన్
ABN , First Publish Date - 2022-09-28T14:09:39+05:30 IST
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఉదయం చిన్నశేషవాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు.
తిరుమల : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఉదయం చిన్నశేషవాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు. రాత్రి 7గంటలకు హంస వాహనంపై శ్రీవారు ఊరేగనున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు. ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది.
కాగా.. నేడు తిరుమల శ్రీవారిని ఏపీ సీఎం జగన్ దర్శించుకున్నారు. కొత్త పరకామణి భవనం... లక్ష్మీవీపీఆర్ రెస్ట్ హౌస్ను ఆయన ప్రారంభించారు. ఇక నుంచి భక్తులు హుండీ కానుకల లెక్కింపును వీక్షించవచ్చు. భక్తులు వీక్షించేలా పరకామణి భవనానికి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ను ఏర్పాటు చేశారు.