తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-08-19T14:01:42+05:30 IST

తిరుమలలో నేడు భక్తుల రద్దీ కాస్త తగ్గింది. నేడు శ్రీవారి దర్శనం కోసం 25 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమల : తిరుమలలో నేడు భక్తుల రద్దీ కాస్త తగ్గింది. నేడు శ్రీవారి దర్శనం కోసం 25 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. గురువారం తిరుమల శ్రీవారిని 70,674 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 35,930 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.53 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 

Updated Date - 2022-08-19T14:01:42+05:30 IST