తిరుమల కాలినడక మార్గం ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన
ABN , First Publish Date - 2020-09-28T14:03:09+05:30 IST
రిలయన్స్ సౌజన్యంతో చేపట్టనున్న అలిపిరి కాలినడక మార్గం ఆధునికీకరణ పనులకు సోమవారం ఉదయం శంకుస్థాపన జరిగింది.
తిరుపతి: రిలయన్స్ సౌజన్యంతో చేపట్టనున్న అలిపిరి కాలినడక మార్గం ఆధునికీకరణ పనులకు సోమవారం ఉదయం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రిలయన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. రూ.25 కోట్లతో కాలినడక మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చింది. ఆరు నెలల్లో పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు.