America లో న్యూఇయర్ పార్టీ వేడుకల్లో పేలిన తూటా.. ముగ్గురు మృతి

ABN , First Publish Date - 2022-01-02T15:03:46+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి.

America లో న్యూఇయర్ పార్టీ వేడుకల్లో పేలిన తూటా.. ముగ్గురు మృతి

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. మిసిసిపీలో న్యూఇయర్ వేడుకల్లో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు హారిసన్ కౌంటీ పోలీసులు వెల్లడించారు. మిసిసిపీ గల్ఫ్‌పోర్ట్‌లో కొత్త సంవత్సర వేడుకల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గల్ఫ్​పోర్ట్​లో జరిగిన పార్టీలో న్యూఇయర్​కు ఒక్క నిమిషం ముందు ఘర్షణ జరిగింది. దీంతో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం అర్థరాత్రి 11.59 నిమిషాలకు కొందరు తుపాకులతో విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డారు. దుండగులు ఒక్కసారిగా పౌరులపై కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను కోరీ డుబోస్(23), సెడ్రిక్ మెక్‌కార్డ్(28), ఆబ్రే లూయిస్(22)గా గుర్తించారు. అటు పాకిస్థాన్‌లోని​ అజ్మీర్​ నగ్రీలో జరిగిన న్యూఇయర్ పార్టీ వేడుకల్లో కూడా కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 18 మంది గాయపడగా.. 11ఏళ్ల ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

Updated Date - 2022-01-02T15:03:46+05:30 IST