ఒక్క పెట్టుబడితో మూడు లాభాలు

ABN , First Publish Date - 2022-06-25T09:03:11+05:30 IST

షాద్‌నగర్‌ సమీపంలోని బాలానగర్‌ వద్ద స్వర్గసీమ శాండల్‌వుడ్‌ ఫార్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ మరో ప్రాజెక్టు చేపడుతోంది.

ఒక్క పెట్టుబడితో మూడు లాభాలు

స్వర్గసీమ వారి ‘సిరుల సీమ 2’ ప్రాజెక్ట్‌


షాద్‌నగర్‌ సమీపంలోని బాలానగర్‌ వద్ద స్వర్గసీమ శాండల్‌వుడ్‌ ఫార్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ మరో ప్రాజెక్టు చేపడుతోంది. ‘సిరుల సీమ 2’ పేరుతో 40 ఎకరాల్లో కంపెనీ ఈ ప్రాజెక్ట్‌ చేపట్టింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన అనుమతులు లభిస్తాయని కంపెనీ తెలిపింది. జడ్చర్ల, రాజాపూర్‌ మండలం తిరుమలాపూర్‌ వద్ద ఈ వెంచర్‌ ప్రారంభం కానుంది. మొత్తం 40 ఎకరాల్లో 200 నుంచి 1,200 గజాల విస్తీర్ణంతో కంపెనీ ‘సిరుల సీమ 2’ ప్రాజెక్ట్‌ చేపడుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో చదరపు గజం ధర రూ.4,900గా కంపెనీ నిర్ణయించింది. ఈ వెంచర్‌లో ప్లాట్లు కొనే వారికి కంపెనీ 15 ఏళ్ల పాటు ఉచిత రిసార్ట్‌ మెంబర్‌షిప్‌ సౌకర్యం కల్పిస్తోంది. దీనికి తోడు ఈ ప్లాట్లలో గంధపు చెట్ల పెంపకం ద్వారా కొనుగోలుదారులకు అదనపు ఆదాయం అందిస్తామని తెలిపింది. 


ప్రత్యేకతలు.. 

ప్రాజెక్ట్‌ వద్ద 24 గంటలు కాపలా

రిసార్ట్‌లో క్లబ్‌హౌస్‌, జిమ్‌, టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌ కోర్టులతో పాటు పలు సదుపాయాలు

వాటర్‌ హార్వెస్టింగ్‌ పిట్ల ఏర్పాటు

100 శాతం వాస్తు ప్రకారం ప్రాజెక్ట్‌ డిజైన్‌

డీటీసీపీ ఆమోదిత లేఅవుట్‌

ప్రాజెక్ట్‌ నీటి అవసరాల కోసం కోటి లీటర్ల సామర్ధ్యంతో చెరువు నిర్మాణం

44వ నంబరు జాతీయ రహదారికి ఎనిమిది కిలోమీటర్ల దూరం

ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే బాలానగర్‌ పట్టణం

45 నిమిషాల డ్రైవ్‌లో రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం

20 నిమిషాల డ్రైవ్‌లో షాద్‌నగర్‌ పట్టణం

Updated Date - 2022-06-25T09:03:11+05:30 IST