ఆ ముగ్గురే!

ABN , First Publish Date - 2022-06-26T07:29:49+05:30 IST

ఆ ముగ్గురే!

ఆ ముగ్గురే!

కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండే యజమాని చనిపోయాడు. ఉన్న ముగ్గురు మహిళలే ఆ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. తమకున్న కొద్దిపాటి భూమిని సొంతంగా సాగు చేసుకుని జీవిస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్‌ పనులు మొదలయ్యాయి. అదనుకు వర్షాలు కురవడంతో రైతులంతా వేరుశెనగ విత్తనాలు వేస్తున్నారు. తమకున్న కొద్దిపాటి భూమిలో ఆ మహిళలు కూడా శనివారం విత్తనాలు వేశారు.  అరక దున్నుతున్న జాహ్నవి రెడ్డి స్వగ్రామం చిత్తూరు జిల్లా యాదమరి మండలం ఓటివారిపల్లె. డిగ్రీ వరకు చదివిన ఈమె ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. ఓ పక్క ఉద్యోగం చేసుకుంటూనే మరోపక్క తల్లికి తోడుగా వ్యవసాయ పనులు చేస్తోంది. జాహ్నవి రెడ్డి అరకపట్టి దున్నగా.. ఆ వెనకే తల్లి,అమ్మమ్మలు విత్తనాలు వేశారు.

Updated Date - 2022-06-26T07:29:49+05:30 IST