చరిత్రాత్మక స్వర్ణం కోసం..

ABN , First Publish Date - 2022-05-15T09:49:18+05:30 IST

చారిత్రక పసిడి పతకం ఊరిస్తున్న వేళ..భారత పురుషుల జట్టు పటిష్ట థాయ్‌లాండ్‌తో ఆదివారం జరిగే థామస్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ ఫైనల్‌ తుదిపోరుకు సిద్ధ మైంది.

చరిత్రాత్మక స్వర్ణం కోసం..

పటిష్ట ఇండోనేసియాతో భారత్‌ ఢీ నేడు

థామస్‌ కప్‌ ఫైనల్‌

బ్యాంకాక్‌: చారిత్రక పసిడి పతకం ఊరిస్తున్న వేళ..భారత పురుషుల జట్టు పటిష్ట థాయ్‌లాండ్‌తో ఆదివారం జరిగే థామస్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ ఫైనల్‌ తుదిపోరుకు సిద్ధ మైంది. ప్రత్యర్థి ఏకంగా 14సార్లు చాంపియన్‌గా నిలిచిన ఘనత కలిగి ఉన్నా..తొలిసారి ఫైనల్‌కు చేరిన భారత్‌లో ఆత్మవిశ్వాసం ఉరకలేస్తోంది. సీనియర్లు కిడాంబి శ్రీకాంత్‌, ప్రణయ్‌ తమపై ఉన్న అంచనాలను వమ్ము చేయకుండా రికార్డు స్థాయిలో చెరో ఐదు మ్యాచ్‌ల్లో గెలిచారు. స్టార్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ కీలక సమయాల్లో అద్భుత ప్రదర్శనతో ఔరా అనిపించారు. ప్రపంచ నెం. 9 లక్ష్యసేన్‌ మార్చిలో జరిగిన జర్మన్‌ ఓపెన్‌లో ఇండోనేసియాకు చెందిన నాలుగో ర్యాంకర్‌ ఆంథోని సినిసుకను చిత్తు చేశాడు. ఈ నేపథ్యంలో ఆదివారం..సినిసుకతో మ్యాచ్‌కు లక్ష్యసేన్‌ను ఆడించే అవకాశాలున్నాయి. వరల్డ్‌ నెం.8 జొనాథన్‌ క్రిస్టీతో శ్రీకాంత్‌.. ప్రపంచ 24వ ర్యాంకర్‌ షెసార్‌ హిరెన్‌ను ప్రణయ్‌ ఢీకొనే చాన్సుంది.  

Updated Date - 2022-05-15T09:49:18+05:30 IST