ఈ ఏడాది రూ.12 వేల కోట్ల టర్నోవర్
ABN , First Publish Date - 2022-10-01T06:53:54+05:30 IST
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మార్గదర్శి చిట్ ఫండ్ టర్నోవర్ రూ.12,000 కోట్లకు చేరే అవకాశం ఉందని మార్గదర్శి చిట్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ శైలజా కిరణ్ అన్నారు.
మార్గదర్శి చిట్ ఫండ్ ఎండీ శైలజా కిరణ్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మార్గదర్శి చిట్ ఫండ్ టర్నోవర్ రూ.12,000 కోట్లకు చేరే అవకాశం ఉందని మార్గదర్శి చిట్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ శైలజా కిరణ్ అన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్ రూ.9,712 కోట్లు నమోదైందని తెలిపారు. కంపెనీ 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇప్పటి వరకూ 60 లక్షల మందికి పైగా చందాదారులకు సేవలు అందించాం. 1962లో మార్గదర్శి సేవలను ప్రారంభించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకల్లో 108 శాఖలతో సేవలు అందిస్తున్నామని శైలజా కిరణ్ అన్నారు. వ్యాపారపరంగా, శాఖలపరంగా మార్గదర్శి అగ్రస్థానంలో ఉందని ఆమె తెలిపారు.