దిశ వ్యవస్థలో ఇది కీలక విజయం: మంత్రి రోజా

ABN , First Publish Date - 2022-04-30T02:56:53+05:30 IST

దిశ వ్యవస్థలో ఇది కీలక విజయం: మంత్రి రోజా

దిశ వ్యవస్థలో ఇది కీలక విజయం: మంత్రి రోజా

అమరావతి: దేశాన్ని కుదిపేసిన నిర్భయ కేసులో శిక్ష పడడానికి ఏడేళ్లు పట్టిందని మంత్రి రోజా అన్నారు. గుంటూరు రమ్య కేసులో 257 రోజుల్లో నిందితుడికి ఉరిశిక్ష పడిందని రోజా తెలిపారు. మార్పు అంటే ఇదే అని, దిశ వ్యవస్థలో ఇది కీలక విజయమని మంత్రి రోజా తెలిపారు.


రమ్య హత్య కేసు నిందితుడికి ఉరి శిక్ష సరైనదే అని, ఈ తీర్పు పట్ల మహిళా వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయని ఆమె తెలిపారు. దిశ చట్టం స్ఫూర్తితో ప్రత్యేక న్యాయస్థానం ద్వారా విచారణ జరిగిందన్నారు. పోలీసులు కూడా వేగంగా దర్యాప్తు చేశారని, మహిళలపై జరిగే దాడులకు సంబంధించి ఈ తీర్పు మైలురాయని, పోలీసులు చాలా బాగా పని చేశారని తెలిపారు.

Updated Date - 2022-04-30T02:56:53+05:30 IST