బీజేపీపై డెమొక్రాటిక్‌ సర్జికల్‌ స్ట్రైక్‌ చేయాలి

ABN , First Publish Date - 2020-11-28T07:30:37+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో మజ్లి్‌సకు ఓటువేసి బీజేపీపై డెమొక్రాటిక్‌ సర్జికల్‌ స్ట్రైక్‌ చేయాలని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పాతబస్తీలో పాకిస్థానీలు,

బీజేపీపై డెమొక్రాటిక్‌ సర్జికల్‌ స్ట్రైక్‌ చేయాలి

ఓటర్లకు అసదుద్దీన్‌ ఒవైసీ విజ్ఞప్తి 

హైదరాబాద్‌, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో మజ్లి్‌సకు ఓటువేసి బీజేపీపై డెమొక్రాటిక్‌ సర్జికల్‌ స్ట్రైక్‌ చేయాలని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పాతబస్తీలో పాకిస్థానీలు, రోహింగ్యాలు ఉన్నారని అంటూ హైదరాబాద్‌ నగర ప్రతిష్ఠను దిగజార్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.


శుక్రవారం అసదుద్దీన్‌ ఒవైసీ కార్వాన్‌ నియోజకవర్గం షేక్‌పేటలో పాదయాత్ర చేసి, బహిరంగసభలో ప్రసంగించారు. పోలింగ్‌ రోజున ఓట్లు వేయడానికి ఆసక్తి చూపకపోవడంతో షేక్‌పేట ప్రాంతంలో కేవలం 40ు మాత్రమే పోలింగ్‌ జరుగుతుందన్నారు. హైదరాబాద్‌ నగర సమ్మిళిత సంస్కృతి పరిరక్షణకు, మత సామరస్యతను కాపాడేందుకు మజ్లి్‌సను గెలిపించాలని కోరారు.


Updated Date - 2020-11-28T07:30:37+05:30 IST