జనగామలో దొంగల హల్చల్.. ఓ ఇంట్లో చోరీ చేసి పరారవుతుండగా..
ABN , First Publish Date - 2020-07-03T17:10:32+05:30 IST
జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్ కాలనీలో గురువారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. హైదరాబాద్ రోడ్లో ఉన్న సంగి రాజేష్ అనే వ్యక్తి ఇంటిలోని బీరువాలో
జ్యోతినగర్ కాలనీలో రూ.7.20 లక్షల బంగారు, వెండి ఆభరణాలు
- రూ.60 వేల నగదు అపహరణ
జనగామ టౌన్ (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్ కాలనీలో గురువారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. హైదరాబాద్ రోడ్లో ఉన్న సంగి రాజేష్ అనే వ్యక్తి ఇంటిలోని బీరువాలో ఉన్న 15 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలు, రూ.60 వేల నగదు అపహరించారు. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. క్రూయిజర్ వాహనాన్ని నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న రాజేష్ భార్య పిల్లలతో కలిసి జ్యోతినగర్ కాలనీలో కిరాయి ఇంట్లో నివసిస్తున్నాడు. బుధవారం రాజేష్ తన స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా వెల్మజాలకు వెళ్లాడు.
ఈ క్రమంలో గురువారం దుండగులు ఇంట్లో చోరీచేసి, పరారవుతుండగా స్థానికులు రాజేష్ కు సమాచారం అందించారు. ఈ మేరకు రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు. డీసీపీ బి.శ్రీనివా్సరెడ్డి, ఏసీపీ వినోద్కుమార్, సీఐ డి.మల్లేశ్యాదవ్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుడి నుంచి వివరాలు తెలుసుకుని క్లూస్టీంతో సంఘటన స్థలం పరిశీలించి, దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు.