వైఎస్ కుటుంబమంతా తనతోనే ఉంది: సునీతా రెడ్డి

ABN , First Publish Date - 2021-08-14T03:12:25+05:30 IST

సీబీఐ విచారణపై తనకు నమ్మకం ఉందని వైఎస్‌ సునీతా రెడ్డి అన్నారు. వైఎస్ కుటుంబమంతా తనతోనే ఉందని వైఎస్‌ సునీతా రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ వివేకా హత్య కేసుపై ఎక్కువ మాట్లాడవద్దని సీబీఐ విజ్ఞప్తి చేసిందని వైఎస్‌ సునీతా రెడ్డి చెప్పారు.

వైఎస్ కుటుంబమంతా తనతోనే ఉంది: సునీతా రెడ్డి


కడప: సీబీఐ విచారణపై తనకు నమ్మకం ఉందని వైఎస్‌ సునీతా రెడ్డి అన్నారు. వైఎస్ కుటుంబమంతా తనతోనే ఉందని వైఎస్‌ సునీతా రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ వివేకా హత్య కేసుపై ఎక్కువ మాట్లాడవద్దని సీబీఐ విజ్ఞప్తి చేసిందని వైఎస్‌ సునీతా రెడ్డి చెప్పారు.  


మరోవైపు తమ కుటుంబానికి భద్రత కల్పించాలని కడప ఎస్పీకి వైఎస్‌ సునీత లేఖ రాశారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆమె వాపోయారు. ఈ నెల 10న సాయంత్రం 5:20 గంటలకు ఓ అనుమానితుడు తమ ఇంటిచుట్టూ రెండుసార్లు తిరిగాడని, ఇంటి కాంపౌండ్‌ తరువాతి డోర్‌ దగ్గర ఆగి ఫోన్‌ కాల్స్‌చేశాడని లేఖలో సునీత వెల్లడించారు. శివశంకర్‌రెడ్డి బర్త్‌ డే కోసం ఏర్పాటైన ఫ్లెక్సీలోని వ్యక్తిలాగే అనుమానితుడు కనిపించాడని, ఈ విషయాన్ని సీఐకి ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. చివరికి ఆ వ్యక్తిని మణికంఠరెడ్డి అని తేల్చారని తెలిపారు. శివశంకర్‌రెడ్డికి మణికంఠరెడ్డి అత్యంత సన్నిహితుడని సునీత చెప్పారు. తన తండ్రి హత్యకేసులో శివశంకర్‌రెడ్డి కీలకమైన అనుమానితుడని, ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని శివశంకర్‌రెడ్డి పాత్రను నిగ్గుతేల్చాలని కోరారు. అయితే వివేకా హత్య కేసులో ఈ రోజు సీబీఐ విచారణకు శివశంకర్‌రెడ్డి హాజరయ్యారు.

Updated Date - 2021-08-14T03:12:25+05:30 IST