సెల్‌టవర్ ఎక్కిన యువరైతు...ఉద్రిక్తం

ABN , First Publish Date - 2022-04-30T15:46:31+05:30 IST

జిల్లాలోని సిరికొండ మండలం గ్రామం న్యావనంది గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

సెల్‌టవర్ ఎక్కిన యువరైతు...ఉద్రిక్తం

నిజామాబాద్: జిల్లాలోని సిరికొండ మండలం గ్రామం న్యావనంది గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగదాంబ తండాకు చెందిన యువరైతు జేతూరం సెల్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. రబీ సీజన్‌లో ప్రభుత్వం వరి సాగు వద్దనడంతో యువ రైతు పొద్దు తిరుగుడు పంట సాగు చేశాడు. అయితే నకిలీ విత్తనాలతో పంట దిగుబడి రాక నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశాడు. విషయం తెలిసిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని యువ రైతును కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

Updated Date - 2022-04-30T15:46:31+05:30 IST