అక్రమ కట్టడాల తొలగింపులో వేగం పెంచాలి

ABN , First Publish Date - 2020-09-18T06:34:49+05:30 IST

నాలాలపై అక్రమ కట్టడాల తొలగింపులో వేగాన్ని పెంచాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ పమేలాసత్పతి ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్‌ అధికారులతో గురువారం సమావేశమై

అక్రమ కట్టడాల తొలగింపులో వేగం పెంచాలి

వరంగల్‌ సిటీ, సెప్టెంబర్‌ 17: నాలాలపై అక్రమ కట్టడాల తొలగింపులో వేగాన్ని పెంచాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ పమేలాసత్పతి ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్‌ అధికారులతో గురువారం సమావేశమై నాలాలపై ఆక్రమణల తొలగింపు పనులతీరుపై సమీక్షించారు. కమిషనర్‌ మాట్లాడుతూ నయీంనగర్‌, భద్రకాళి నాలాలతో పాటు బొందివాగుపై గల ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్‌ఈ విద్యాసాగర్‌, సీపీ నర్సింహరాములు, ఈఈ లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-09-18T06:34:49+05:30 IST