రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతీయ జెండా!
ABN , First Publish Date - 2022-08-30T08:26:35+05:30 IST
స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలోనే అతిపెద్ద వంద అడుగుల జాతీయ జెండాను మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్సీ విద్యావేత్త చుక్కా..
తొర్రూరులో ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి
తొర్రూరు, ఆగస్టు 29: స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలోనే అతిపెద్ద వంద అడుగుల జాతీయ జెండాను మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్సీ విద్యావేత్త చుక్కా రామయ్య, జిల్లా కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో ఉన్న 280 అడుగుల జాతీయ జెండాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎగురవేశారని, దాని తర్వాత రెండో అతిపెద్ద 100 అడుగుల జెండాను తొర్రూరులో ఏర్పాటు చేసి ఎగురవేయడం ఎంతో గర్వంగా ఉందని మంత్రి అన్నారు. వంద అడుగుల ఎత్తు ఉన్న ఇనుప స్థంభాన్ని గుజరాత్ నుండి తెప్పించామని దీని విలువ రూ.12 లక్షలు ఉంటుదన్నారు.