పాలనలో జడ్పీటీసీలు, ఎంపీటీసీల పాత్ర పెంచాలి
ABN , First Publish Date - 2021-02-25T08:00:17+05:30 IST
స్థానికపాలనలో జడ్పీటీసీలు, ఎంపీటీసీల భాగస్వామం పెంచాలని స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు కోరారు.
మంత్రి ఎర్రబెల్లికి కవిత సహా ఎమ్మెల్సీల వినతి
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): స్థానికపాలనలో జడ్పీటీసీలు, ఎంపీటీసీల భాగస్వామం పెంచాలని స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు కోరారు. ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో పలువురు ఎమ్మెల్సీలు బుధవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును కలిసి వినతిపత్రం సమర్పించారు. మరిన్ని అధికారాలు, నిధులు ఇవ్వడం ద్వారా స్థానిక సంస్థల్లో జడ్పీటీసీలు, ఎంపీటీసీల పాత్ర పెరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి 16 అంశాలను మంత్రికి నివేదించారు. ఇదేవిషయమై త్వరలో సీఎం కేసీఆర్ను కలుస్తామని, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోనూ భేటీ అయి పార్టీ పరంగా మద్దతు కోరుతామని ఎమ్మెల్సీ భానుప్రసాద్ వెల్లడించారు.