AP High Court: రుషికొండపై తదుపరి విచారణ ఈ నెల 27కి వాయిదా

ABN , First Publish Date - 2022-07-19T17:44:11+05:30 IST

రుషికొండ పర్యవరణ ఉల్లంఘనలపై హైకోర్టులో విచారణ జరుగుతుంది.

AP High Court: రుషికొండపై తదుపరి విచారణ ఈ నెల 27కి వాయిదా

అమరావతి: రుషికొండ(Rushikonda) పర్యవరణ ఉల్లంఘనలపై ఏపీ హైకోర్టు(AP High Court)లో విచారణ జరుగుతుంది. రుషికొండ వ్యవహారాల కేసులో తనను కూడా ఇంప్లీడ్ చేయాలని  వైసీపీ నర్సాపురం రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు(Raghuramakrishnam RajU) పిటీషన్ దాఖలు చేశారు.ఈ కేసులో ఇప్పటికే హైకోర్టులో2 ప్రజాప్రయోజన వ్యాజ్యాలు  దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు(Supreme Court) సూచనల మేరకు రఘురామ పిటీషన్‌ను అనుమతించాలని  న్యాయవాది ఉమేష్ చంద్ర హైకోర్టులో వాదించారు. ఉమేష్ చంద్ర వాదనలను పరిగణలోకి తీసుకుని రఘురామరాజు పిటీషన్‌ను సీజే నేతృత్వంలోని ధర్మాసనం  విచారణకు అనుమతినిచ్చింది. రఘురామరాజు తరపున రుషికొండ పర్యావరణ ఉల్లంఘనలపై న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. రఘురామ పిటీషన్‌పై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా  సీజే నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. రుషికొండ అంశంపై తదుపరి విచారణను ఈ నెల 27కి హైకోర్టు వాయిదా వేసింది.

Updated Date - 2022-07-19T17:44:11+05:30 IST