భార్యమృతికి కారకుడైన భర్తకు పదేళ్లు జైలు శిక్ష
ABN , First Publish Date - 2022-07-28T12:08:56+05:30 IST
భార్యమృతికి కారకుడైన భర్తకు పదేళ్లు జైలు శిక్షను విధిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి సునీత కుంచాల బుధవారం తీర్పు చెప్పారు. పీపీ రవిరాజ్
నిజామాబాద్: భార్యమృతికి కారకుడైన భర్తకు పదేళ్లు జైలు శిక్షను విధిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి సునీత కుంచాల బుధవారం తీర్పు చెప్పారు. పీపీ రవిరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇం దల్వాయి మండలం వెంగల్పాడ్ గ్రామానికి చెందిన లావుడ్యా లావణ్య వివాహం సిరికొండ మండలం పాకాల గ్రామానికి చెందిన బాధవత్ నవీన్తో జనవరి ఒకటో తేదీ 2013లో వివాహం జరిగింది. వివాహంలో రూ. 80 వేల నగదు కట్నంతో పాటు బంగారం, ద్విచక్రవాహనం ఆమె తల్లిదండ్రులు సమర్పించారు. వీరి దాంప్య జీవితంలో కుమార్తె, కుమారుడు ఉన్నారు. అదనపు కట్నం కావాలని భార్యను వేధించేవాడు.. తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె వ్యవసాయ భూమిలోని బావిలో దూకి ఆత్మహ త్య చేసుకుంది. ఈ విషయమై కుటుంబసభ్యులు సిరికొండ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఐపీసీ 304బీ, 498/ఏ సెక్షన్లపై కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సాక్షాధారాలను కోర్టులో ప్రవేశపెట్టగా కో ర్టు విచారణ చేసి నవీన్కు పదేళ్ల కఠిన జైలు శిక్ష, పదివేల జరిమానా క ట్టని యెడల మరో ఆరు నెలల జైలు శిక్ష విధించాలని తీర్పు చెప్పారు.