జగన్ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి హెచ్చరిక
ABN , First Publish Date - 2020-10-02T01:43:37+05:30 IST
జగన్ ప్రభుత్వాన్ని హైకోర్టు మరోసారి హెచ్చరించింది. రూల్ ఆఫ్ లా సరిగ్గా అమలు కాకుంటే ఇతర అధికారాన్ని వినియోగిస్తామని
అమరావతి: జగన్ ప్రభుత్వాన్ని హైకోర్టు మరోసారి హెచ్చరించింది. రూల్ ఆఫ్ లా సరిగ్గా అమలు కాకుంటే ఇతర అధికారాన్ని వినియోగిస్తామని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు హెచ్చరించింది. న్యాయ వ్యవస్థపై నమ్మకం లేదా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. అయితే పార్లమెంట్కు వెళ్లి ఏపీ హైకోర్టును మూసేయమని అడగండి.. న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చడాన్ని సహించబోమని హైకోర్టు చెప్పింది. హైకోర్టుపైనే వివాదాస్పద వ్యాఖ్యలా? అని కోర్టు ప్రశ్నించింది. దీని వెనుక కుట్ర ఉందేమో తేలుస్తామని హైకోర్టు తెలిపింది. జడ్జీలపై ఆరోపణలతో హైకోర్టే పిటిషన్ వేసుకోవాల్సి వచ్చిందని, ఇలాంటి స్థితి ఎన్నడూ లేదని కోర్టు పేర్కొంది. జ్యుడీషియరీ స్తంభం బలహీనమైతే 'సివిల్ వార్'కు అవకాశం ఉందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.