జాబ్ క్యాలెండర్ ఏమైందో సీఎం చెప్పాలి: జవహర్
ABN , First Publish Date - 2022-03-03T00:46:30+05:30 IST
రాష్ట్రంలోని నిరుద్యోగులకు డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ ఏమైందో
అమరావతి: రాష్ట్రంలోని నిరుద్యోగులకు డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ ఏమైందో సీఎం చెప్పాలని టీడీపీ నేత కేఎస్ జవహర్ డిమాండ్ చేశారు. పాఠశాలల్లోని ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకుండా నాడు-నేడు పేరుతో విద్యావ్యవస్థను జగన్ రెడ్డి నీరుగార్చారని ఆయన ఆరోపించారు. సచివాలయ సిబ్బందిని ఎప్పుడు రెగ్యులరైజ్ చేస్తారో సీఎం చెప్పాలన్నారు. ఉద్యోగాలు ఇవ్వలేని విభాగాన్ని ఉద్యోగం నుంచి తొలగించిన సవాంగ్కు అప్పగించారని ఆయన ఎద్దేవా చేశారు. పోలీసులను అడ్డంపెట్టుకొని బతకడం పరిపాలన కాదని సీఎం గ్రహించాలని ఆయన హితవు పలికారు.