ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో.. మార్పులు రాజకీయ కోణంలో తగదు
ABN , First Publish Date - 2021-07-18T13:44:42+05:30 IST
ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో..
ఐహెచ్సీ
ఆగ్రా, జూలై 17: ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో సంస్కరణల పేరిట చేపడుతున్న మార్పులపై ఇండియన్ హిస్టరీ కాంగ్రె్స(ఐహెచ్సీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. విద్యా విషయక కారణాలతో కాకుండా రాజకీయ కారణాలతో ఈ మార్పులు చేస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు తమ అభిప్రాయాలను తెలుపుతూ కేంద్రానికి లేఖ రాసింది. ప్రస్తుతం ఉన్న పాఠ్యపుస్తకాల్లో చరిత్ర వక్రీకరణ జరిగిందని, జాతీయ నాయకుల పట్ల వివక్ష చూపారని, దీనిని సరిదిద్దేలా కరికులమ్లో మార్పులపై చర్చ చేపడుతున్నామని పేర్కొంటూ ఈ ఏడాది ఆరంభంలో రాజ్యసభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై ప్రజలు అభిప్రాయాలు తెలిపేందుకు జూన్ 30 వరకు తొలుత గడువిచ్చింది. అనంతరం దానిని ఈ నెల 15 వరకు పెంచిం ది. ఈ మేరకే ఐహెచ్సీ తమ అభిప్రాయాలను తెలిపింది.