ఏపీ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తులు
ABN , First Publish Date - 2022-02-11T01:00:26+05:30 IST
ఏపీ హైకోర్టులో కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు
అమరావతి: ఏపీ హైకోర్టులో కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు నియామకమయ్యారు. నియామక ఉత్తర్వులను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జారీచేశారు. న్యాయమూర్తులుగా కె శ్రీనివాసరెడ్డి, జి రామకృష్ణప్రసాద్, ఎన్ వెంకటేశ్వర్లు, టి రాజశేఖర్రావు, ఎస్ సుబ్బారెడ్డి, సి రవి, వి సుజాతలను నియమించారు. జనవరి 29న కొలిజీయం భేటీలో సీజేఐ జస్టిస్ రమణ నేతృత్వంలో జరిగిన సమావేశంలో సిఫారసు చేశారు.