టీజీవో నగర శాఖ కార్యదర్శిగా లక్ష్మణ్గౌడ్
ABN , First Publish Date - 2020-08-05T00:19:20+05:30 IST
తెలంగాణ గెజిటెడ్ అధికారులు సంఘం (టీజీవో)నగర శాఖ కార్యదర్శిగా టి. లక్ష్మణ్గౌడ్ నియమితులయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ గెజిటెడ్ అధికారులు సంఘం (టీజీవో)నగర శాఖ కార్యదర్శిగా టి. లక్ష్మణ్గౌడ్ నియమితులయ్యారు. సంఘం వ్యవస్దాపక అధ్యక్షుడు, ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చేతల మీదుగా ఆయనకు నియామక పత్రాన్నిఅందజేశారు. ఈ కార్యక్రమంలో టీజీవో రాష్ట్ర అధ్యక్షురాలు మమత, నగర శాఖ అధ్యక్షుడు ఎంబి కృష్ణాయాదవ్, అబ్కారీ గెజిటెడ్ అఽధికారుల సంఘం అధ్యక్షుడు టి.రవీందర్రావు, కమర్షియల్టాక్స్ అధికారుల సంఘం అధ్యక్షుడు బి. వెంకటయ్య, గోనె విష్ణువర్దన్రావు, నగర శాఖ ఉపాధ్యక్షుడు సి. శివరామకృష్ణ, కోశాధికారి స్వర్ణలత, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ ఉద్యోగుల కోరికలను ప్రభుత్వం త్వరలోనే తీరుస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా టీజీవో ఏర్పడిందని, గెజిటెడ్ ఉద్యోగులను తెలంగాణ లక్ష్యసాధనవైపు నడిపించిందన్నారు.