క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా.. కొండపై నుంచి టెర్రరిస్టుల కాల్పులు!
ABN , First Publish Date - 2020-08-08T03:02:06+05:30 IST
వందలాది మంది ప్రేక్షకుల మధ్య, మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు హాజరైన ఓ క్రికెట్ మ్యాచ్పై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు.
ఇస్లామాబాద్: వందలాది మంది ప్రేక్షకుల మధ్య, మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు హాజరైన ఓ క్రికెట్ మ్యాచ్పై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. దగ్గరలోని ఓ కొండపై నుంచి నిర్దాక్షిణ్యంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన దాయాది దేశం పాకిస్తాన్లోని ఓరాక్జై జిల్లాలో జరిగింది. స్థానికంగా జరిగే ఏఎమ్ఎన్ క్రికెట్ టోర్నమెంట్లో ఓ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. దీనిపై స్పందించిన అధికారులు.. ఉగ్రవాదులను అణచివేయడం కోసం వివిధ దళాలతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తామని ప్రకటించారు.