రావులపాలెంలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-05-26T00:40:53+05:30 IST

రావులపాలెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్పీ రస్తోగి ఎస్కార్ట్‌ వాహనంపై గుర్తుతెలియని వ్యక్తి రాయితో దాడి చేశాడు.

రావులపాలెంలో ఉద్రిక్తత

రావులపాలెం: రావులపాలెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్పీ రస్తోగి ఎస్కార్ట్‌ వాహనంపై గుర్తుతెలియని వ్యక్తి రాయితో దాడి చేశాడు. దాడి తర్వాత ఆ వ్యక్తి పరారైనాడు. అమలాపురం అల్లర్లతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటన తర్వాత 100 మంది యువకులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. కొత్తపేట, ఆత్రేయపురం పోలీస్‌ స్టేషన్‌లకు యువకులు తరలించారు. రావులపాలెంలో 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా షాపులను మూసివేశారు. రావులపాలెంలో 400 మంది పోలీసులతో పహరా కాస్తున్నారు. జాతీయ రహదారిపై భారీగా పోలీసులను మోహరించారు.

Updated Date - 2022-05-26T00:40:53+05:30 IST