నందికొట్కూరు పీఎస్ దగ్గర ఉద్రిక్తత
ABN , First Publish Date - 2021-10-28T03:08:39+05:30 IST
జిల్లాలోని నందికొట్కూరు పీఎస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. భూ వివాదంపై
కర్నూలు: జిల్లాలోని నందికొట్కూరు పీఎస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. భూ వివాదంపై మాట్లాడేందుకు మున్సిపల్ ఛైర్మెన్ సుధాకర్రెడ్డి ఇంటికి టీడీపీ మాజీ కౌన్సిలర్ శాంతరాజు వచ్చాడు. తనపై శాంతరాజు దాడి చేశారని పోలీసులకు సుధాకర్ రెడ్డి ఫిర్యాదు చేసాడు. దీంతో శాంతరాజును పోలీసులు స్టేషన్కు తీసుకువచ్చారు. అయితే తనపై పీఎస్లోనే సుధాకర్రెడ్డి, ఆయన వర్గీయులు దాడి చేశారని శాంతరాజు ఆరోపించారు. ఈ ఘటనలో ఇరువర్గాలపై కేసులు నమోదు చేస్తామని ఆత్మకూరు డీఎస్పీ శృతి తెలిపారు.