జనగామ జిల్లా మొండ్రాయిలో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2021-11-16T23:28:08+05:30 IST
జిల్లాలోని కొడకండ్ల మండలం మొండ్రాయిలో ఉద్రిక్త
జనగామ: జిల్లాలోని కొడకండ్ల మండలం మొండ్రాయిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జిల్లాలో బండి సంజయ్ పర్యటన సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. సంజయ్ గోబ్యాక్ అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీగా మోహరించారు.