ఒలింపిక్స్ వాయిదాతో.. పేస్ రిటైర్మెంట్పై సందిగ్ధత?
ABN , First Publish Date - 2020-03-27T10:02:53+05:30 IST
టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడడంతో వెటరన్ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ రిటైర్మెంట్ సందిగ్ధంలో పడింది..! 2020లో టెన్ని్సకు గుడ్బై చెబుతానని పేస్ ప్రకటించిన
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ వాయిదా పడడంతో వెటరన్ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ రిటైర్మెంట్ సందిగ్ధంలో పడింది..! 2020లో టెన్ని్సకు గుడ్బై చెబుతానని పేస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 47 ఏళ్ల లియాండర్ ఇప్పటి వరకు ఏడు సార్లు ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిథ్యం వహించాడు. ఎనిమిదోసారి కూడా విశ్వక్రీడల బరిలోకి దిగాలన్న ఆశాభావంతో ఉన్నాడు. కానీ, కరోనా వైరస్ ప్రబలడంతో టోక్యో ఒలింపిక్స్ను వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. ‘ఇది ఎంతో కఠిన నిర్ణయం. ఒలింపిక్స్ కోసం ఎంతో శ్రమించా. మా నాన్న కూడా కెరీర్ను పొడిగించమని గట్టిగా అడుగుతున్నారు’ అని పేస్ చెప్పాడు. ఈ నేపథ్యంలో మరో ఏడాది టెన్ని్సలో కొనసాగే విషయమై ఆలోచిస్తున్నానని లియాండర్ తెలిపాడు.