Telugudesam పార్టీ యువ నాయకుడి మృతి
ABN , First Publish Date - 2021-10-05T12:11:22+05:30 IST
Telugudesam పార్టీ యువ నాయకుడి మృతి
చిత్తూరు జిల్లా/పెద్దపంజాణి : మండలంలోని రాజుపల్లెలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు వేణుగోపాల్రెడ్డి అనారోగ్యంతో ఆదివారం రాత్రి మృతి చెందాడు. సోమవారం ఉదయం మాజీ మంత్రి అమరనాథరెడ్డి ఆ గ్రామానికి చేరుకుని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాయకులు సుధాకరరెడ్డి, రోజాకృష్ణారెడ్డి, ఆనంద కుమార్, శ్రీరాములు, మురహరిరెడ్డి, భానుప్రతాప్రెడ్డి, ప్రవీణ్కుమార్, బాలకృష్ణారెడ్డి, బట్టందొడ్డి రెడ్డెప్ప తదితరులు నివాళులు అర్పించారు.