తెలుగు రాష్ట్రాల్లో చలిపులి పంజా
ABN , First Publish Date - 2021-12-23T13:35:16+05:30 IST
తెలుగు రాష్ట్రాల్లో చలిపులి పంజా విసురుతోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో చలిపులి పంజా విసురుతోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో చలితీవ్రత అధికంగా ఉంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పరిమితమవుతున్నాయి. చింతపల్లి 7.2, అరకు, పాడేరులో 11, మినుములూరులో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. దట్టమైన పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నాయి. కొమురంభీం జిల్లా గిన్నెదరిలో 7 డిగ్రీలు, సిర్పూర్లో 7.6 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 7.2, ఆర్లి(టి)లో 7.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.