అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. తల్లిదండ్రుల పిలుపుతో వచ్చి.. కరోనా కాటుకు యువతి బలి!

ABN , First Publish Date - 2021-06-18T05:01:09+05:30 IST

అమెరికాలో మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. మంచి ఆదాయం. తల్లిదండ్రులు ఇంటికి రమ్మంటే స్వదేశానికి వచ్చిందా యువతి.

అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. తల్లిదండ్రుల పిలుపుతో వచ్చి.. కరోనా కాటుకు యువతి బలి!

రామగుండం: అమెరికాలో మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. మంచి ఆదాయం. తల్లిదండ్రులు ఇంటికి రమ్మంటే స్వదేశానికి వచ్చిందా యువతి. అలా వచ్చి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ (రామగుండం)లో కృష్ణనగర్‌కు చెందిన ఒక కాంట్రాక్టర్ ఉన్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు నరిష్మారెడ్డి (27) అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి నాలుగేళ్లుగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఇంటికి రావాలని తల్లిదండ్రులు నరిష్మారెడ్డిని ఇంటికి పిలిపించారు. అలా నెలరోజుల క్రితం స్వదేశానికి వచ్చిన నరిష్మా.. 20 రోజుల క్రితం అనారోగ్యం పాలైంది. కరోనా సోకినట్లు తేలింది. ఆమె తల్లికీ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇద్దరూ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. వారం రోజుల కిందట నరిష్మాకు కరోనా టెస్ట్ చేయగా నెగిటివ్ ఫలితం వచ్చింది. కానీ ఆరోగ్యం మాత్రం కుదుటపడలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఆమెను హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నరిష్మ కన్నుమూసింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం కమ్ముకుంది. ‘‘అమెరికాలోనే ఉన్నా బతికేదానికి తల్లీ.. అనవసరంగా మా కోసం వచ్చి కరోనాకు బలైపోయావు’’ అంటూ ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.

Updated Date - 2021-06-18T05:01:09+05:30 IST