గోల్ఫ్‌ టోర్నీలో తెలుగమ్మాయిల సత్తా

ABN , First Publish Date - 2020-10-31T10:18:19+05:30 IST

వరల్డ్‌ అమెచ్యూర్‌ గోల్ఫ్‌ ర్యాంకింగ్‌ టోర్నీలో భాగంగా నోయిడాలో జరిగిన మాస్టర్స్‌ టూర్‌ చాంపియన్‌షి్‌పలో తెలుగమ్మాయిలు

గోల్ఫ్‌ టోర్నీలో తెలుగమ్మాయిల సత్తా

నోయిడా: వరల్డ్‌ అమెచ్యూర్‌ గోల్ఫ్‌ ర్యాంకింగ్‌ టోర్నీలో భాగంగా నోయిడాలో జరిగిన మాస్టర్స్‌ టూర్‌ చాంపియన్‌షి్‌పలో తెలుగమ్మాయిలు అమృత మండవ, శ్రీహిత మండవ అదరగొట్టారు. రెండ్రోజులుగా జరుగుతున్న ఈ పోటీలు శుక్రవారం ముగిశాయి. బాలికల విభాగంలో అమృత ఓవరాల్‌గా 215 స్కోరుతో ద్వితీయ స్థానాన్ని దక్కించుకోగా 216 పాయింట్లతో శ్రీహిత తృతీయ స్థానాన్ని సొంతం చేసుకొంది. ఢిల్లీ అమ్మాయి రాగిణి నవీత్‌ (212) అగ్రస్థానంలో నిలిచింది.

Updated Date - 2020-10-31T10:18:19+05:30 IST