తెలుగు అథ్లెట్ల హవా

ABN , First Publish Date - 2022-08-20T10:58:16+05:30 IST

జాతీయ ఓపెన్‌ పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌పలో తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు మూడు పతకాలు సాధించి సత్తా..

తెలుగు అథ్లెట్ల హవా

పారా చాంపియన్‌షిప్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ ఓపెన్‌ పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌పలో తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు మూడు పతకాలు సాధించి సత్తా చాటారు. బెంగళూరులో శుక్రవారం జరిగిన పురుషుల టి-46 కేటగిరీలో మోహన్‌ కృష్ణ (తెలంగాణ) స్వర్ణం గెలవగా, షేక్‌ అబ్దుల్‌ ఖాదర్‌ (తమిళనాడు) రజతం, భవిక్‌ (గుజరాత్‌) కాంస్యం నెగ్గారు. మహిళల టి-20 రేసులో దీప్తి (తెలంగాణ) స్వర్ణం చేజిక్కించుకోగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లలిత కాంస్య పతకం దక్కించుకొంది.

Updated Date - 2022-08-20T10:58:16+05:30 IST