Ts Vidyut Employees: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పవర్ కట్..!

ABN , First Publish Date - 2022-08-08T00:31:50+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పవర్ కట్ (Power Cut) నిర్వహిస్తున్నట్లు పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ (Power Engineers Association), విద్యుత్ జేఏసీ ప్రతినిధులు..

Ts Vidyut Employees: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పవర్ కట్..!

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పవర్ కట్ (Power Cut) నిర్వహిస్తున్నట్లు పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ (Power Engineers Association), విద్యుత్ జేఏసీ ప్రతినిధులు (Vidyut Jac Leaders) ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ (Central Government) ప్రవేశపెడుతున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లు‎(Electricity Act Amedment Bill)కు నిరసనగా మహాధర్నా (MahaDharna) చేపడుతున్నట్లు తెలిపారు. మహాధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. 


ఈ సందర్భంగా విద్యుత్ జేఏసీ నేతలు మాట్లాడుతూ ‘‘కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 8న (సోమవారం) పార్లమెంట్‌లో విద్యుత్ చట్టసవరణ బిల్లును ప్రవేశపెట్టాలని చూస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు విధులు బహిష్కరించాలి. ఒక వేళ విద్యుత్ సరఫరా‎లో అంతరాయం వస్తే పునరుద్ధరణ పనులు చేయకుండా నిరసన తెలుపుతాం. దానికి వినియోగదారులు సహకరించాలి. విద్యుత్ బిల్లును ప్రవేశపెడితే విధులు బహిష్కరించి నిరవధికంగా సమ్మెకు దిగుతాం.’’ అని హెచ్చరించారు. 

Updated Date - 2022-08-08T00:31:50+05:30 IST